ఇది కండబలం,గుండెబలం దండిగావున్న వినుకొండ జనం చేస్తున్న జన జర్నలిజం

10.18.2011

గత యాబై సంవత్సరాలలో మూడు లక్షల మంది పసికందులను అపహరించిందట ఈ మతసంస్థ

http://www.dailymail.co.uk/news/article-2049647/BBC-documentary-exposes-50-year-scandal-baby-trafficking-Catholic-church-Spain.html

గత యాబై సంవత్సరాలలో మూడు లక్షల మంది పసికందులను అపహరించిందట ఈ మతసంస్థ.
ఎంతఘోరం ? చదావండి పై లింకులో

10.12.2011

ప్రమాదంలో మహారాష్ట్ర డ్రైవర్ మృతి





వినుకొండ నియోజక వర్గంలోని నుజండ్ల మండలం కొత్తపాలెం నుండి మహారాష్ట్ర లోని బలహార్శా కు యూకలిప్టస్ కట్టెల లోడు తో వెళుతున్న లారి ప్రమాదానికి గురైనది .11 kw లైన్ విద్యుత్ తీగలు తగలటంతో లారి డ్రైవర్ రజిత్[౨౫] మరణించాడు . వినుకొండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

ప్రమాదంలో మహారాష్ట్ర డ్రైవర్ మృతి

9.26.2011

నూజండ్ల మండలంలో పాఠశాల విద్యార్థులకు ఈరోజు అధికారులు దుస్తుల పంపిణీ


నూజండ్ల మండలంలో పాఠశాల విద్యార్థులకు ఈరోజు అధికారులు దుస్తుల పంపిణీ చేసారు . మండలకేంద్రమైన నూజండ్ల,లక్ష్మీపురం, రాముడు పాలెం తండా పాఠ శాలలో ఇంచార్జ్ మడలాభివ్రుద్ది అధికారి బ్రహ్మయ్య,ఎ వో వి.వి. రమేష్
లు పిల్లలకు దుస్తులు అందజేశారు

7.12.2011

వైభవంగా శ్రీరామలింగేశ్వరస్వామి తిరునాళ్ల

వైభవంగా శ్రీరామలింగేశ్వరస్వామి తిరునాళ్ల

వినుకొండటౌన్, జూలై 11: వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీరామలింగేశ్వరస్వామి తిరునాళ్ళ తొలి ఏకాదశి పర్వదినాన అత్యంత వైభవంగా జరిగింది. పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద, చిన్నకొండ(చిన్నతిరుమల)పై ఉన్న ఆలయాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. తిరునాళ్ళ సందర్భంగా పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో వినుకొండ భక్తజనంతో కిటకిటలాడింది. గుంటూరు-కర్నూలు హైవే నుంచి మెయిన్ రోడ్డు గుండా బోసుబొమ్మ సెంటర్ మీదుగా కొండపైకి వెళ్ళే రహదారి కిక్కిరిసింది. కొండకింద మెట్ల వద్ద ఉన్న స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు జరిపించి భక్తులు కొండపైకి తరలివెళ్ళారు. ఎటుచూసినా శివనామస్మరణే..

తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా పెద్దకొండ, చిన్నకొండల పైనే కాకుండా పట్టణంలోని ప్రధాన వీధులన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. వీధివీధినా వివిధ స్వచ్ఛంద, వ్యాపార వర్గాలు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. మున్నెన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులు ఆసక్తిగా తిలకించారు.

వైభవంగా శ్రీరామలింగేశ్వరస్వామి తిరునాళ్ల

వైభవంగా శ్రీరామలింగేశ్వరస్వామి తిరునాళ్ల

వినుకొండటౌన్, జూలై 11: వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీరామలింగేశ్వరస్వామి తిరునాళ్ళ తొలి ఏకాదశి పర్వదినాన అత్యంత వైభవంగా జరిగింది. పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద, చిన్నకొండ(చిన్నతిరుమల)పై ఉన్న ఆలయాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. తిరునాళ్ళ సందర్భంగా పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో వినుకొండ భక్తజనంతో కిటకిటలాడింది. గుంటూరు-కర్నూలు హైవే నుంచి మెయిన్ రోడ్డు గుండా బోసుబొమ్మ సెంటర్ మీదుగా కొండపైకి వెళ్ళే రహదారి కిక్కిరిసింది. కొండకింద మెట్ల వద్ద ఉన్న స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు జరిపించి భక్తులు కొండపైకి తరలివెళ్ళారు. ఎటుచూసినా శివనామస్మరణే..

తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా పెద్దకొండ, చిన్నకొండల పైనే కాకుండా పట్టణంలోని ప్రధాన వీధులన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. వీధివీధినా వివిధ స్వచ్ఛంద, వ్యాపార వర్గాలు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. మున్నెన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులు ఆసక్తిగా తిలకించారు.

6.06.2011

రాష్ట్రంలోని కేజీబీ పాఠశాలలలో టాప్ రాంకర్ ప్రసన్న


వివిధకారణాలతో చదువుమానివేస్తున్న ఆడపిల్లలకోసం కస్తూరిబా బాలికలగురుకులపాఠశాలలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నది. అక్కడ చదువుతున్న ఆడపిల్లలు కార్పోరేట్ పాఠశాలలకంటె మెరుగైన ఫలితాలు సాధిస్తూ ముందుకు దూసుకు వెళుతున్నాయి . ఈసంవత్సరం జరిగిన పదవతరగతి పరీక్షలలో రాష్ట్రం మొత్తంలోని ఈపాఠశాలలలో చదివిన విద్యార్థులలో నూజండ్ల కెజిబి లోచదివిన విద్యార్థిని మాదాలప్రసన్న టాపర్ గానిలచింది . 570 మార్కులు సాధించి పేదరికంలోనుంచివచ్చిన పిల్లలు అవకాశమిస్తే తమసత్తా చూపిస్తారని నిరూపించింది . నూజండ్ల కెజిబి కి ఒకప్రత్యేకత తెచ్చిన ఈ అమ్మాయిని ఈరోజు జరిగిన ఒకకార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అభినందించి సత్కరించారు. పాఠశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ ,ఎమ్ ఈ ఓ వరప్రసాద్ ,మండల సర్పంచులు ఎమ్ పీ టీసీ సభ్యులు అభ్నందించి ఆర్ధికప్రోత్సాహాన్నందించారు . ఈ సందర్భంగా అంకితభావంతో మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తున్న ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ గారిని ప్రజాప్రతినిధులు కొనియాడారు.

కోటిరూపాయల వ్యయంతో ములకలూరులో మహాదేవుని ఆలయం


నూజండ్లమండలం ములకలూరు గ్రామంలో కోటిరూపాయలవ్యయంతో నిర్మించిన రామలింగేశ్వరుని ఆలయంలో ప్రతిష్ఠామహోత్సవాలు ఈరోజు ముగిశాయి. గ్రామసమీపంలోని గుండ్లకమ్మనది ఒడ్డున ఉన్నపురాతన రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని గ్రామస్తులు గ్రామంలోకి తరలించి పునఃనిర్మాణం గావించారు. నిన్నటివరకు రాజకీయ కక్షలతో అట్టుడికి వివాదలగ్రామంగా పేరుపొందిన గ్రామంలో ఈ నిర్మాణంతో రుగ్మతలన్నీ సమసిపోయి అపూర్వమైన ఐక్యతవెల్లివిరిసింది. గ్రామక్షేమంకోసం తమ విబేధాలను పక్కనబెట్టి గ్రామమంతా ఈ యజ్జ్ఞానికి నడుంకట్టారు. స్వంతగా కోటిరూపాయలు సమకూర్చుకుని గ్రామగ్రామమంతా అహర్నిశం శ్రమించి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.
ఈసందర్భంగా బంధువులతోను భక్తులతోనూ గ్రామం కిక్కిరిసి తిరుణాళ్లవాతావరణాన్ని తలపింపజేసింది.

5.22.2011

"చిరు" చానల్ వచ్చేస్తోందా ?


ఇప్పుడు చిరంజీవి అభిమానులలో ఇదేచర్చ . కాంగ్రేస్ లో చేరి వ్రతంచెడ్డా ఫలితం దక్కనట్లుగా తయారైన పరిస్థితి నుంచి కోలుకోవడానికి చానల్ ఓపెన్ చేయడం ద్వారాప్రయత్నం సాగించవచ్చని అభిమానులు
"చిరు" చానల్ వచ్చేస్తోందా ? అని చర్చించుకుంటూన్నారు .

రాచ"కీయం

Although the idea of chiranjeevi to start his own news channel dates back to birth of Praja Rajyam Party yet there was no visible progress till date. In difference here comes a media report that Chiru’s 24 hour news channel is set to take off in a couple of months. Name of channel and other details are still under discussion, it is ex-CEO of a general entertainment channel will make this show run. Accordingly this CEO is in completing the formalities in USA to make sure that channel will go air in August.

Chiranjeevi who was one of the directors earlier for MAA TV stepped down only to start his own channel which will now become possible in next few weeks. Mega Star is aiming at maintaining no rivalry with existing channels but ready to compete with them in TRPs.

5.18.2011

ఉపాధ్యాయ వర్గాల్లో కలవరం

ప్రభుత్వం రోజుకో జి.వో మరియు సవరనలతో ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ప్రక్రియ ను గందరగోళంగా తయారుచేసింది. ప్రస్తుతం ప్రాధమిక పాఠశాలలలో ఎన్రోల్మెంట్ ఆధారంగ సర్దుబాటు జి.వో ఒకింత గందరగోలంగ తయారయిందని ఉపాధ్యాయ వర్గాలు ఆందోలనకు గురీగుతున్నారు. ప్రభుత్వము ఇప్పటికైనా కళ్ళు తెరచి ప్రక్రియను అర్ధవంతముగా జరపాలని దానికి తగిన జివోలను వెంటనే విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుచున్నాయి

వినుకొండ సేవానమితి - సంతకాల సేకరణ కార్యక్రమం

వినుకొండ సేవాసమితి ఆధ్వర్యంలో వినుకొండ సమితి లో గల వినుకొండ ,బొల్లాపల్లి, ఈపూరు,శావల్యాపురం మరియు నూజెండ్ల మండలాలను పూరెస్ట్ ఆఫ్ పూర్ మండలాలుగా గుర్తించాలని ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించడానికి సంతకాల సేకరన జరిపింది . ఈ కార్యక్రామానికి ఐదు మండలాలనుంచి రైతులు విరివిగా పాల్గొన్నారు.సంతకాల సేకరన పూర్తి అయిన తరువాత ప్రభుత్యానికి మెమోరాండం సమర్పించనున్నట్లు సేవాసమితి వారు వివరించారు.కార్యక్రమానికి పురప్రముఖులు అందరు హాజరు అయినారు.

5.17.2011

వీరేంద్రసెహ్వాగ్ అరుదైన ఫోటోలు


వినుకొండ కుమ్మరి బజారులో రామాలయం ప్రతిష్ఠ.


వినుకొండ కుమ్మరి బజారు లో పునర్నిర్మితమైన రామాలయంలో త్రయాహ్నికంగా ప్రతిష్ఠా కార్యక్రమాలు మొదలయ్యాయి . ఈనెల 16 నుండి మొదలైన కార్యక్రమాలు 18 తో ముగుస్తాయి. భద్రాచలం లోని మూర్తులను పోలిన విగ్రహాలను ప్రతిష్ఠకు సిద్ద పరిచారు. చివరి రోజున భారీగా అన్నదానం నకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

4.15.2011

హనుమత్ రక్షాయాగం ప్రారంభం . అందరికీ ఆహ్వానం

వినుకొండ నియోజకవర్గం నూజండ్ల మండలం రవ్వవరం లో గల ప్రముఖ ఆథ్యాత్మికకేంద్రం "శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం" హనుమత్ రక్షాయాగం ఈనెల ౧౬ శనివారం నుంచి మొదలవుతున్నది . జీవితంలో తామెదుర్కుంటున్న సమస్యలను తామే భగవత్ కృపతో పరిష్కరించుకోవటం కోసం వ్యక్తులను ఈఆథ్యాత్మిక ప్రయోగం లోపాల్గొనేందుకు ఆహ్వానిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మహర్షులిచ్చిన అపారమైన మన ఆథ్యాత్మిక సంపదను మనం సవ్యమైన రీతిలో ఉపయోగించుకుని మనవ్యక్తిగత క్షేమము,లోకశ్రేయస్సు సాధించవచ్చని వివరించారు .
ప్రతివారూ తమగోత్రనామాలను యాగకేంద్రానికి పంపి సూచించిన నియమానుసారం సాధనచేసుకోవాలని వారు తెలిపారు . వివరాలకు ఇక్కడ చూడండి

http://durgeswara.blogspot.com/2011/04/blog-post_10.html

1.21.2011

ఉద్యోగ సంఘాల నిరశన


జాయంట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు పెన్ డౌన్ చాక్ డౌన్ కార్యక్రమంలో పాల్గొన్నారు
రాముడుపాలెం స్కూల్ లో ప్రధానోపాధ్యాయుల కుజరిగిన టెలికాన్ఫరెన్స్ ను బహిష్కరించారు. ఉద్యోగసంఘాల ఐక్యతవర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు.


అలాగే నియోజక వర్గంలోని నూజండ్ల లో సిద్దయోగి యోగయ్యస్వామి వారి తిరుణాళ్ల వైభవంగా జరిగింది .
అలాగే మండల పరిషత్ సర్వసభ్యసమావేశం కూడా ఈరోజు జరిగింది .

1.20.2011

కన్నుమూసిన మరో అన్నదాత

విధి వెక్కిరిస్తోంది ,వ్యవసాయం జూద మయిపోతుంది. అన్నం పెట్టేచెయ్యికదా ఆదుకుందామనే ఆలోచన ప్రభుత్వానికి గాని జనానికి గాని లేదు . ఇంకేం చేస్తాడు .ఈ మాయదారిలోకానికి సెలవంటూ అన్నదాత తానునమ్ముకున్న భూమితల్లి గర్భంలోకి వెళ్ళిపోతున్నాడు.
వినుకొండ నియోజక వర్గంలోని నూజండ్ల మండలం లో ఈరోజు మరో అన్నదాత కన్నుమూసాడు. కాదుకాదు బలవంతంగా తనప్రాణం తీసుకున్నాడు. పాతనాగిరెడ్డి పల్లె కు చెందిన నాదెండ్ల చిన వెంకటసుబ్బయ్య అప్పులుచేసి మరీ వ్యవసాయం చేస్తున్నాడు. ఈనాటి రైతులమ్దరి స్థితీ ఇదే . ఒకపక్క వరి మరోవంక మిర్చి సాగుచేస్తున్నాడు. వరి నష్టపరచింది , మిర్చి మోసం చేసేలాఉంది. ఒకవంక కుటుంబఖర్చులేకాక పిల్లలఫీజులుకూడా పెరిగిపోయి అప్పులపైవడ్డీలు
కట్టెదుట తాటిచెట్టులా కనపడుతుంటే దిక్కుతోచక నిన్నరాత్రి పొలానికి వెళ్ళి అక్కడే ఉన్న పురుగుమందు తాగాడు.పురుగులు నిర్మూలిస్తుందనుకుని పొలంమీద చల్లినప్పుడు మోసం చేసిన ఆ మాయదారి పురుగుమందు ఇప్పుడుమాత్రం ఆభూమిపుత్రుని నమ్మకాన్ని వమ్ముచేయలేదు. అన్నంపెట్టే చేయి అచేతనంగా మారింది. ఆరైతుకుటుంబం దు:ఖానికి మావంతు ఓకన్నీటిబిందువును జతచేరుస్తున్నాము
----------- వినుకొండ ప్రెస్ టీమ్