ఇది కండబలం,గుండెబలం దండిగావున్న వినుకొండ జనం చేస్తున్న జన జర్నలిజం

6.06.2011

కోటిరూపాయల వ్యయంతో ములకలూరులో మహాదేవుని ఆలయం


నూజండ్లమండలం ములకలూరు గ్రామంలో కోటిరూపాయలవ్యయంతో నిర్మించిన రామలింగేశ్వరుని ఆలయంలో ప్రతిష్ఠామహోత్సవాలు ఈరోజు ముగిశాయి. గ్రామసమీపంలోని గుండ్లకమ్మనది ఒడ్డున ఉన్నపురాతన రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని గ్రామస్తులు గ్రామంలోకి తరలించి పునఃనిర్మాణం గావించారు. నిన్నటివరకు రాజకీయ కక్షలతో అట్టుడికి వివాదలగ్రామంగా పేరుపొందిన గ్రామంలో ఈ నిర్మాణంతో రుగ్మతలన్నీ సమసిపోయి అపూర్వమైన ఐక్యతవెల్లివిరిసింది. గ్రామక్షేమంకోసం తమ విబేధాలను పక్కనబెట్టి గ్రామమంతా ఈ యజ్జ్ఞానికి నడుంకట్టారు. స్వంతగా కోటిరూపాయలు సమకూర్చుకుని గ్రామగ్రామమంతా అహర్నిశం శ్రమించి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.
ఈసందర్భంగా బంధువులతోను భక్తులతోనూ గ్రామం కిక్కిరిసి తిరుణాళ్లవాతావరణాన్ని తలపింపజేసింది.

No comments:

Post a Comment