
నూజండ్లమండలం ములకలూరు గ్రామంలో కోటిరూపాయలవ్యయంతో నిర్మించిన రామలింగేశ్వరుని ఆలయంలో ప్రతిష్ఠామహోత్సవాలు ఈరోజు ముగిశాయి. గ్రామసమీపంలోని గుండ్లకమ్మనది ఒడ్డున ఉన్నపురాతన రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని గ్రామస్తులు గ్రామంలోకి తరలించి పునఃనిర్మాణం గావించారు. నిన్నటివరకు రాజకీయ కక్షలతో అట్టుడికి వివాదలగ్రామంగా పేరుపొందిన గ్రామంలో ఈ నిర్మాణంతో రుగ్మతలన్నీ సమసిపోయి అపూర్వమైన ఐక్యతవెల్లివిరిసింది. గ్రామక్షేమంకోసం తమ విబేధాలను పక్కనబెట్టి గ్రామమంతా ఈ యజ్జ్ఞానికి నడుంకట్టారు. స్వంతగా కోటిరూపాయలు సమకూర్చుకుని గ్రామగ్రామమంతా అహర్నిశం శ్రమించి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.
ఈసందర్భంగా బంధువులతోను భక్తులతోనూ గ్రామం కిక్కిరిసి తిరుణాళ్లవాతావరణాన్ని తలపింపజేసింది.
No comments:
Post a Comment