ఇది కండబలం,గుండెబలం దండిగావున్న వినుకొండ జనం చేస్తున్న జన జర్నలిజం

12.19.2009

అధికారులమధ్య సమన్వయ లోపం ...రైతులపాలిట శాపం


నూజండ్ల మండలంలో ప్రధాన నీటిపారుదాల వనరైన పి.బి.సి. తరచూ వివదాల పాలవుతున్నది. గుంటూరు ,ప్రకాశం జిల్లాలలో పలు గ్రామాలకు సాగునీరు త్రాగునీరు అందించే ఈ కాల్వ అధికారుల అనాలోచిత పర్యవేక్షణ కారణంగా రైతులమధ్య చిచ్చురేపుతున్నది.

శనివారం రవ్వవరం పి.బిసి. రెగ్యులేటర్ వద్ద ,ప్రధానమైన జమ్మలమడుగు ,మోదేపల్లి మేజర్లకు వారబంధి పెట్టాలనుకున్న అధికారుల నిర్ణయాన్ని రైతులు ,నీటిసంఘాలు వ్యతిరేకించారు. దరిశి బ్రాం చ్ కెనాల్ నుంచిపి.బి.సికి రావలసిన వాటా నీటిని విడుదల చేస్తే ఇరు మేజర్ల క్రింద పొలాలకు నీటిసమస్య రాదని ,అలాకాకుండా నీటి లో అక్కడ కోతపెట్టి ఇక్కడ వారబంధీ అంటె ఎలా అని వాల్లు ప్రశ్నించారు. తీవ్రమైన వాగ్విదాలు జరగటం తో అధికారులు ఏవిషయాన్ని చెప్పకుండా వెనుదిరిగారు. దరిశి డిఈ మాట్లాడుతూ గుంటూరు జిల్లా అధికారులు నీటిని సరిగా విడుదల చేయటం లేదని అందువల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. ప్రకాశం ,గుంటూరు జిల్లా అధికారుల సమన్వయ లోపం రైతులపాలిట శాపమవుతుంది .తరచు రైతులమధ్య గొడవలకు కారణ మవుతున్నది .