ఇది కండబలం,గుండెబలం దండిగావున్న వినుకొండ జనం చేస్తున్న జన జర్నలిజం

11.24.2009

సాధారణమరణానికి కూడా అధికారులు వెళ్ళి నివాళులివ్వాలా?

సి.ఎం సోదరి మరణించారు .ఇది ఆకుటుంబానికి విషాద సంఘటన . కానీ ఎనభైరెండేల్ల పండు ముసలమ్మ మరణం జిల్లాకంతటికీ విషాదంలా గా కలెక్టర్ ,ఎస్పీ , శాసనసభ డిప్యూటీ స్పీకర్ [ఈయనంటే స్తానిక ఎమ్మెల్యే] ఇలా వరుసగా వెళ్ళి నివాళు లర్పించారు . ఎందుకని . నిత్యం సమస్యలతో సతమతమవుతున్న జిల్లాలో కీలక అధికారులకు సమయం చాలా విలువైనది. అలాంటిది పదవి ఉన్నవారి బంధుగణం కోసం సమయాన్ని వెచ్చించాల్సి న అవసరం వున్నదా ? అని జనం ప్రశ్నిస్తున్నారు. బంధువర్గమో లేక ఏదన్నా దుస్సంఘటనో అయితే అధికారుల పర్యటన అవసరం .తప్పదు. మొన్న నెల్లూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం లో వినుకొండకు చెందిన ఓ వైశ్యకుటుంబం ఘోరప్రమాదానికి గురై తీవ్ర విచారం లో వున్నా ,అక్కడికెళ్ళి పలకరించటానికి సమయం ఇవ్వలేకపోయిన అధికారులు జీవితం సంపూర్ణంగా అనుభవించి కన్నుమూసిన ముసలవ్వ కోసం వెళ్లారంటె అధికార మాయ అని జనం విస్తు పోతున్నారు .

కాకుంటే ముఖ్యమంత్రిగారి సోదరి కి నివాళులర్పించిన రాజకీయ నాయకులెవరు కూడా తమ పడికట్టు పదాలు "ఈ మె అకాలమరణం రాశ్ట్రానికి తీరని లోటు " ఇలాంటి పదాలు వాడలేదు సంతోషం .

No comments:

Post a Comment