ఇది కండబలం,గుండెబలం దండిగావున్న వినుకొండ జనం చేస్తున్న జన జర్నలిజం

11.25.2009

దమ్ముచక్రాల దెబ్బకు దుమ్మవుతున్న రోడ్లు

లక్ష లాది రూపాయలు వెచ్ఫ్హ్చిమ్చి మరమ్మత్తులు చేసిన రోడ్లు ఏడాది తిరగకుండానే దమ్ముచక్రాల ధాటికి దుమ్మవుతున్నాయి . అధికారుల ప్రయవేక్షణ మ్రుగ్యమవటం తో ప్రజాధనం వృధా అవటమే కాదు ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి . వినుకొండ నియోజక వర్గం లో గత ఏడాది ఆర్ అండ్ బి వాళ్లు మరమ్మత్తులు చేపట్టి రోడ్లు బాగు చేసారు. ఇప్పుడు వ్యవసాయ పనులు ప్రారంభం కావటం తో దమ్ము ట్రాక్టర్లు తిరగటం వలన రోడ్లు పాడై పోతున్నాయి .

విపరీత వేగంతో ట్రాక్టర్ డ్రైవర్లు బండ్లు నడపటం తో దమ్ము కాకరాల రాపిడికి తారు పొరలు లేచిపోతున్నాయి . కొన్ని చోట్ల గుంతలు పడుతున్నాయి . బాధ్యతలేని విరివల్ల రోడ్ల రూపురేఖలే మారి పోతున్నాయి . రైతులు ఇపని తప్పనిసరి గనుక ట్రాక్టర్లను చిన్నగా నడిపితే అంతగా నష్టం జరగదు . కాని బాద్యత లేని తనం . దీనికి తోడూ ఆశాఖ దికారుల నిర్లిప్తత .వెరసి ఇరోజు ఈపూరు ,నూజండ్ల శావల్యాపురం ,వినుకొండ మండలాలలో ధ్వంసమైన రోడ్లు దర్శనమిస్తున్నాయి

No comments:

Post a Comment