ఇది కండబలం,గుండెబలం దండిగావున్న వినుకొండ జనం చేస్తున్న జన జర్నలిజం

11.24.2009

దత్తాభిషేకాలకు మీతరపున ఓకలశం ఏర్పాటు చేపించుకుని పాల్గొనవచ్చు

వినుకొండ ప్రాంతం లో ఆథ్యాత్మికంగా బహుసేవలను అందిస్తూ కార్యక్రమాలను చేపడుతున్న నూజండ్లమండలం రవ్వవరం గ్రామము లో వున్న "శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం " మరో ఆథ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టింది . వచ్చేనెల[డిసెంబర్] రెండవతేదీన రానున్న పౌర్ణమి సందర్భంగా అక్కడ సమీపంలో కూర్మగిరిపై వెలసిన "కొండగురునాథుని " క్షేత్రం లో దత్తజయంతి పూజలు నిర్వహిస్తున్నారు. ఒకటవతేదీ శుక్రవారం రాత్రి కి కొండమీద ధ్యానాలు జరుగుతాయి . రెండవతేదీ నౌదయం రుద్రసూక్తం తో స్వామివారికి అభిషేకములు ,అర్చనలు ,అనంతరము గాయత్రీ హోమము జరుపనున్నారు. నాథసాంప్రదాయం లో ప్రసిద్దమైన ఈ కొండమీద దత్తుడు దారు శిలామూర్తిగా వేలాది సంవత్సరాలనుంచి పూజలందుకోవటం విశేషము అదీ ఎండకెండుతూ, వానకు తడుస్తూ . రాష్ట్రం లో పలు ప్రాంతాలనుంచి భక్తులు ఇక్కడకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు మాఘమాసంలో జరిగే తిరుణాల్లకు .

ఇంత ప్రసిద్దమైన ఈ క్షేత్రం లో దత్త పూజలు జరిపి ఆ ఆదిగురువు గురునాథుని అనుగ్రహం అందరికీ కలిగేలా చేయాలనే సంకల్పం తో ఈకార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పీఠ ప్రధాన సేవకులు దుర్గేశ్వర గారు తెలిపారు . స్వామికి భక్తులతరపున నూటా ఎనిమిది కలశాలతో అభిషేకం జరుపుతామని ,కోరిన వారి తరపున ఒక్కొక్కకుటుంబం పేరున ఒక్క కలశం ఏర్పాటు చేస్తామని వివరించారు . పూర్తి వివరాలకు ఈక్రింది లింక్ చూడండి .
http://durgeswara.blogspot.com/2009/11/blog-post_23.హ్త్


No comments:

Post a Comment